యాప్నగరం

మానవత్వం చాటిన జగన్.. వీడియో వైరల్

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. 108 అంబులెన్స్ వెనుక నుంచి వస్తున్న విషయాన్ని గమనించిన జగన్ తన కాన్వాయ్‌ను పక్కకు జరిపించారు.

Samayam Telugu 21 Nov 2021, 5:49 pm
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లి వెళ్తుండగా ఎనికేపాడు వద్ద ఒక అంబులెన్స్ సీఎం కాన్వాయ్ వెనుక వస్తుంది. ఇది గమనించిన జగన్ అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ని పక్కకు జరిపించారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samayam Telugu వైఎస్ జగన్


గతంలోనూ అనేక సందర్భాల్లో జగన్ అంబులెన్స్‌లకు దారి ఇచ్చారు. ఓదార్పు యాత్ర, పాదయాత్ర సమయాల్లోనూ తన మీటింగ్‌లను ఆపి మరీ ఆయన అంబులెన్స్‌లను పంపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కాన్వాయ్‌ని స్లో చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

2019వ సంవత్సరం జూలై 13వ తేదీ.. తిరుపతికి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వస్తున్న సందర్భంగా.. ఆయనకు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి రేణిగుంటకు వెళ్లేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఆ సమయంలో తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమయంలో.. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద అంబులెన్స్ సైరన్ వినిపించడంతో.. 108కి దారి ఇచ్చేందుకు జగన్ తన కాన్వాయ్ ఆపించారు.

ఆ తర్వాత 2020, సెప్టెంబర్ 2వ తేదీన.. కడప జిల్లా పులివెందుల నుంచి తాడేపల్లి నివాసానికి వస్తున్న సమయంలో.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తాడేపల్లికి కారులో బయల్దేరారు. అదే సమయంలో గూడవల్ల నిడమానూరు మధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. ఇది గమనించిన జగన్ అంబులెన్స్‌కి దారి ఇచ్చి ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.