యాప్నగరం

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్.. తొలి టీకా స్వీపర్‌కు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను సీఎం జగన్ సమక్షంలో విజయవాడ జీాజీహెచ్‌లో ప్రారంభించారు. తొలి టీకాను బి.పుష్పకుమారి అనే స్వీపర్‌కు వేశారు.

Samayam Telugu 16 Jan 2021, 1:25 pm
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయవాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో ఉదయం 11 గంటలు దాటిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం జగన్ సమక్షంలో ఐదుగురికి వ్యాక్సిన్ ఇచ్చారు. ముందుగా వైద్యారోగ్య శాఖలో స్వీపర్‌గా పని చేసే బి.పుష్పకుమారికి టీకా వేశారు. అనంతరం జీజీహెచ్‌ సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న సీహెచ్.నాగజ్యోతికి టీకా వేశారు. మూడో వ్యాక్సిన్‌ను విజయవాడ జీజీహెచ్‌లో ఆర్థోపెడిక్ విభాగంలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా పని చేసే పి.జయకుమార్ మూడో వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Samayam Telugu jagan at vaccination


ఇదే హాస్పిటల్‌లో స్టాఫ్ నర్సుగా పని చేసే కె.మరియమ్మకు నాలుగో వ్యాక్సిన్ వేశారు. విజయవాడ జీజీహెచ్‌ కోవిడ్-19 డ్యూటీలో ఉన్న మెడికల్ ఆఫీసర్.. డాక్టర్ ఎల్.ప్రణీతకు ఐదో వ్యాక్సిన్ ఇచ్చారు. ఈమె కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏపీలో తొలి రోజు 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి చొప్పున 33,200 మందికి వ్యాక్సినేషన్ జరుగుతుంది. వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తక్షణమే వైద్య సాయం అందించడానికి వీలుగా అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.
తొలి డోస్ తర్వాత 28 రోజులకు వ్యాక్సిన్ రెండో డోస్ వేస్తారు. ముందుగా వైద్యారోగ్య సిబ్బందికి టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. రెండో దశలో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు టీకాలు వేస్తారు. మూడో దశలో 50 ఏళ్లు దాటిన సామాన్య ప్రజలకు వ్యాక్సిన్ వేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.