యాప్నగరం

ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

దసరా మహోత్సవాల సందర్భంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదివారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 2 Oct 2022, 4:29 pm
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదివారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు.
Samayam Telugu బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సీఎం జగన్


అనంతరం అమ్మవారి ఆలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

అంతకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని తదితరులు కూడా ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.