యాప్నగరం

ఏపీకి చేరిన కోవిడ్ వ్యాక్సిన్.. పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు, ముందు వారికే

ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వ్యాక్సిన్‌ను గన్నవరంలోరి శీతలీకరణ కేంద్రానికి అధికారులు తరలించారు. బుధవారం 19 వాహనాలలో అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్‌ పాయింట్లకు తరలించనున్నారు.

Samayam Telugu 12 Jan 2021, 1:58 pm
ఏపీకి కోవిడ్ వ్యాక్సిన్ చేరుకుంది. గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ చేరుకుంది.. తొలివిడతగా 4.7 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపారు. ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వ్యాక్సిన్‌ను గన్నవరంలోరి శీతలీకరణ కేంద్రానికి అధికారులు తరలించారు. బుధవారం 19 వాహనాలలో అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్‌ పాయింట్లకు తరలించనున్నారు. ఈ నెల 16న కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండేలా వ్యాక్సిన్‌ డెలివరీ వాహనాలలో ఏర్పాట్లు చేశారు.
Samayam Telugu వ్యాక్సిన్


గన్నవరం రాష్ట్రస్థాయి స్టోరేజ్‌ సెంటర్‌లో రెండు పెద్ద వాక్‌ ఇన్‌ కూలర్స్‌.. ఒకటి 40 క్యూబిక్‌ మీటర్లు.. రెండోది 20 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యం ఉన్న వాటిని సిద్ధం చేశారు. వ్యాక్సిన్‌ భద్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. రాష్ట్రస్థాయి వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ కేంద్రం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బయటి వ్యక్తులకు ప్రవేశం నిషేధించారు.. 8 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. టీకాల పంపిణీలో భాగంగా తొలి దశలో 3.87లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. ఈనెల 16వ నుంచి కరోనా వారియర్స్‌కు టీకాల పంపిణీ ప్రారంభించనున్నారు.. ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.