యాప్నగరం

భార్య ఏకాంత వీడియోలతో బెదిరింపులు.. గుంటూరులో దారుణం

ప్రభుత్వ ఇంజనీర్ భార్య పోలీసులను ఆశ్రయించింది. తన ఏకాంత వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడని భర్తపై ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 19 Jan 2021, 4:10 pm
ఆయనో ప్రభుత్వ శాఖలో జూనియర్ ఇంజనీర్. పెళ్లై ఏడాది తిరక్కుండానే అదనపు కట్నం కోసం నీచానికి దిగజారాడని.. తనతో ఏకాంతంగా గడిపిన వీడియోలను ఇంటర్నెట్‌లో‌ అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు దిగాడంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. భర్త వేధింపులపై ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. నగరంలోని పట్టాభిపురానికి చెందిన యువతికి 2019లో ఆర్‌డబ్ల్యూఎస్ జూనియర్ ఇంజనీర్‌తో వివాహమైంది. పెళ్లైన కొద్దిరోజులకే ఆమెను భర్త వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తేవాలని హింసించేవాడు. పుట్టింటి నుంచి రూ.5 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని.. లేకుంటే తనతో ఏకాంతంగా గడిపిన వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడని భార్య అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వేధింపులకు గురిచేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
harassment


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.