యాప్నగరం

800 మంది ఆడబిడ్డలపై అఘాయిత్యాలు.. ఏపీకి రెండోస్థానం: దేవినేని ఉమా

వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దిశ, దశ రెండూ లేవని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. మహిళలపై లైంగిక దాడిలో రెండవ, భౌతిక దాడిలో మొదటి స్థానంలో ఉండటం సిగ్గుచేటని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 27 Apr 2022, 12:47 pm
వైఎస్సార్సీపీ అరాచకపాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారపార్టీ అండతో 800 మంది ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు తెగబడ్డారని ఆరోపించారు. మహిళలపై లైంగిక దాడిలో రెండవ, భౌతిక దాడిలో మొదటి స్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు. దిశచట్టం అని చెప్పి మోసం చేయడం తప్ప మూడేళ్లలో ఎంతమంది నిందితులకు శిక్షవేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దిశ చట్టాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.
Samayam Telugu మాజీ మంత్రి దేవినేని ఉమా


వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దిశ, దశ రెండూ లేవని దేవినేని ఉమా అన్నారు. నిందితుల్లో చాలా మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే ఉన్నారని ఆరోపించారు. తన పరిపాలనకు తీరుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సిగ్గులో తలదించుకోవాలని అన్నారు. నేడు రాష్ట్రంలో గంజాయి, మత్తు మందు దొరకని పట్టణం లేదన్నారు. రాష్ట్రంలో పోలీసులను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు కాకుండా.. ఉన్మాదులపై చర్యలు తీసుకునేందుకు ఉపయోగించట్లేదని దేవినేని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్య, అత్యాచార బాధితులకు సంఘీభావంగా ఆయన ర్యాలీ నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.