యాప్నగరం

ఆ మంత్రి పేకాట డెన్‌లో ఒక రోజు టర్నోవర్ ఇరవై కోట్ల పైనే.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

బూతుల మంత్రి పేకాట శిబిరాలతో వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి.గడ్డం గ్యాంగ్ పేకాట డెన్‌లో ఒకరోజు టర్నోవర్ ఇరవై కోట్ల పైనే, పట్టుబడిన మొత్తాన్ని కోర్టులో స్వాధీనం చేయాలి’ అని డిమాండ్.

Samayam Telugu 4 Jan 2021, 11:40 am
ఏపీ మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘బూతుల మంత్రి పేకాట శిబిరాలతో వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తమిరశలో గడ్డం గ్యాంగ్ పేకాట డెన్‌లో ఒకరోజు టర్నోవర్ ఇరవై కోట్ల పైనే, పట్టుబడిన మొత్తాన్ని కోర్టులో స్వాధీనం చేయాలి. మీ మంత్రి, అనుచరులపై కేసు నమోదు చేసి మంత్రిని బర్తరఫ్ చేయాలి. సీబీఐతో సమగ్రవిచారణ చేయించే ధైర్యం ఉందా? వైఎస్ జగన్’ అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
Samayam Telugu గుడివాడ

కృష్ణా జిల్లాలో పేకాట స్థావరాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. నందివాడ మండలంలోని తమిరశలో ఆదివారం రాత్రి దాడులు నిర్వహించిన ఎస్ఈబీ అధికారులు 30 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. 28 కార్లతో పాటు కోట్లాది రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. గుడివాడ రూరల్‌, నందివాడ మండలాల్లోని చేపల చెరువులే కేంద్రంగా ఈ శిబిరాలు నడుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ధనవంతులు ఇక్కడికి వచ్చిన పేకాటలో మునిగి తేలుతున్నారని, నిర్వాహకులు వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటనను టార్గెట్ చేసి మాజీ మంత్రి విమర్శలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.