యాప్నగరం

Kesineni Nani తో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే తండ్రి భేటీ.. టీడీపీ ఎంపీపై ప్రశంసలు

Kesineni Nani తో మాజీ మంత్రి సమావేశం అయ్యారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎంపీ నాని రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను .. నిబద్ధత, నిజాయతీ కల నాయకునిగా ప్రజల మన్ననలు పొందిన తీరును ప్రశంసించినట్లు కేశినేని భవన్ తెలియజేసింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తండ్రి ఎంపీ కేశినేని నానిని కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యే కీలక వ్యాఖ్యలు చేసిన వసంత నాగేశ్వరరావు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 10 Jan 2023, 5:33 am

ప్రధానాంశాలు:

  • కేశినేని నానితో మాజీ మంత్రి సమావేశం
  • ఆసక్తికరంగా మారిన ఇద్దరు నేతల భేటీ
  • ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన వసంత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vasantha Nageswara Rao
కృష్ణా జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎంపీ కేశినేని నానిని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) తండ్రి వసంత నాగేశ్వరరావు (Vasantha Nageswara Rao) భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కేశినేని భవన్ తెలియజేసింది.. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. 'గౌరవనీయులు, రాజకీయ దురంధరులు మాజీ హోం శాఖా మాత్యులు, ఎంపి కేశినేని నాని గారి శ్రేయోభిలాషి వసంత నాగేశ్వరరావు గారు ఈరోజు కేశినేని భవన్ లో ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) గారిని కలసి ఎంపి గారి తాతగారు శ్రీ కేశినేని వెంకయ్య గారితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. అనేక సామాజిక, రాజకీయ అంశాలను చర్చించడమే కాక శ్రీ కేశినేని నాని గారు రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను .. నిబద్ధత, నిజాయతీ కల నాయకునిగా ప్రజల మన్ననలు పొందిన తీరును ప్రశంసించి శుభాకాంక్షలు తెలిపారు' పోస్ట్ చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తండ్రి టీడీపీ ఎంపీతో సమావేశం కావడం ఆసక్తికరంగా మారగా.. ఇద్దరి మధ్య ఉన్న పరిచయాలతో మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెబుతున్నారు. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదంటున్నారు. వసంత నాగేశ్వరరావుకు ఎంపీ కేశినేని నాని తండ్రితో పరిచయాలు ఉన్నాయని.. అందుకే మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారంటున్నారు. అంతేకాదు వసంత నాగేశ్వరరావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.

తండ్రి వసంత నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (Ntr Health University) పేరు మార్పు, రాజధాని అంశం, కమ్మ సామాజిక వర్గానికి కేబినెట్‌లో స్థానం లేదంటూ ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ వంటి ఓ మహనీయుడు పేరు మార్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మహానాయుడు.. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని కామెంట్ చేశారు. ఈ నిర్ణయం బాధకలిగించిందన్నారు.

రాజధాని కూడా గుంటూరు-విజయవాడ మధ్య ఉంటే బావుంటుందన్నారు. అమరావతి రైతులు రూపాయి తీసుకోకుండా రాజధాని కోసం 32వేల ఎకరాలు ఇచ్చిన ఘనత ప్రపంచంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. రాజధానికి అమరావతి అనువైన ప్రాంతమని.. రాష్ట్రానికి కూడా ఉంటుందన్నారు. అంతేకాదు ఏపీ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదన్నారు. గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గంలో 35శాతం వైఎస్సార్‌సీపీకే ఓట్లు వేశారన్నారు. అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇస్తే బావుంటుంది అన్నారు.

తండ్రి వ్యాఖ్యలకు కుమారుడు కృష్ణ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు నోళ్లకు తాళాలు వేయలేమని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Ys Rajasekhar Reddy) అనేవారని.. వారిలో తన తండ్రి వసంత నాగేశ్వరరావు ఉన్నారన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని.. వీళ్లని అదుపు చేయలేమని ఎన్నో సార్లు వ్యాఖ్యానించారన్నారు. వాగే నోరు, తిరిగే కాలు ఆగదు అన్నట్లుగా తన తండ్రి కూడా అంతేనని.. అవన్నీ ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పుకొచ్చారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.