TDP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ జయమంగళ వెంకటరమణ పార్టీకి రాంరాం చెప్పారు. త్వరలోనే అధికార పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మధ్యవర్తిత్వంతో ayamangala Venkataramana వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. కైకలూరు TDP ఇంఛార్జ్గా ఉన్న జయమంగళ వెంకట రమణ.. చాలా కాలంగా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అవకాశం కోసం చూస్తున్న ఆయనకు తాజాగా.. వైసీపీ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇస్తామని చెప్పడంతో వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపించారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో ఖాళీలు అయ్యే స్థానాలతో కలుపుకొని.. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి వెంకటరమణకు ఇవ్వబోతున్నట్టు సమాచారం.
అయితే.. వెంకటరమణ పని తీరు బాగాలేదని.. అందుకే ఆయన్ని Kaikaluru స్థానం నుంచి తప్పించి వేరే వాళ్లకు అవకాశం ఇస్తారని ఎప్పటి నుంచో టీడీపీలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకట రమణ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో కైకలూరు జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా.. ఆయనకు టికెట్ రాలేదు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
అయితే.. వెంకటరమణ పని తీరు బాగాలేదని.. అందుకే ఆయన్ని Kaikaluru స్థానం నుంచి తప్పించి వేరే వాళ్లకు అవకాశం ఇస్తారని ఎప్పటి నుంచో టీడీపీలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకట రమణ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో కైకలూరు జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా.. ఆయనకు టికెట్ రాలేదు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News