యాప్నగరం

జనసేన ముఖ్యనేతతో వంగవీటి రాధా భేటీ.. పవన్ టూర్‌కు ముందు ఆసక్తికరం!

తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన్ను రాధా కలవడం ఆసక్తికరంగా మారగా.. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని సమాచారం.

Samayam Telugu 28 Dec 2020, 9:03 am
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కలిశారు. విజయవాడలోని ఓ హోటల్‌లో ఈ సమావేశం జరిగింది. తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ మచిలీపట్నం కలెక్టరేట్‌కు వస్తున్నారు. అందుకే మనోహర్‌ను కలిసిన రాధా ఈ కార్యక్రమానికి తన మద్దతు తెలిపారు. ఈ భేటీలో రాజధాని ఆందోళనలు, తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. మనోహర్‌ను రాధా కలవడం ఆసక్తికరంగా మారగా.. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని సమాచారం.
Samayam Telugu రాధా-నాదెండ్ల


మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మచిలీపట్నంలో పర్యటించనున్నారు. నివర్‌ తుపాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్‌ ఏ.ఎం.డి.ఇంతియాజ్‌కు పవన్ వినతిపత్రం అందజేయనున్నారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేల రూపాయలు పరిహారంగా అందించాలని, తక్షణ సాయంగా పది వేల రూపాయలు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.