యాప్నగరం

బైక్‌పై విజయవాడకు బయల్దేరిన తండ్రీకూతురు.. ఇంతలో సడన్‌గా..!

కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న తండ్రీకూతురు ప్రమాదానికి గురయ్యారు. తండ్రి సడన్‌గా అస్వస్థతకు గురి కావడంతో ఈ ప్రమాదం జరిగింది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 13 Feb 2023, 5:11 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో తండ్రీకూతురు ఘోర ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సక్కుర్తి వీరాంజనేయులు, ఆయన కుమార్తె సక్కుర్తి మానస కలిసి ఇద్దరు బైక్‌పై వెళ్తున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ, మరికాపట్లో గమ్యానికి చేరుకుంటారనగా.. ఉన్నట్లుండి బైక్ నడుపుతున్న వీరాంజనేయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఇద్దరూ రోడ్డు ప్రమాద బారిన పడ్డారు.

ఈ ఘటన కృష్ణా జిల్లా, గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చోటుచేసుకుంది. వీరాంజనేయులు, ఆయన కుమార్తె మానస గన్నవరం నుంచి విజయవాడకు బైక్‌పై బయల్దేరారు. ఈ క్రమంలో వీరాంజనేయులకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. దీంతో బైక్ అదుపుతప్పి బుడమేరు వంతెనను ఢీకొట్టి పల్టీలు కొట్టగా.. పక్కనే కాలువలోకి తండ్రీకూతురు పడిపోయారు.

దీంతో తండ్రి సక్కుర్తి వీరాంజనేయులు, మానస తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉండగా.. కుమార్తె సక్కుర్తి మానసకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.