యాప్నగరం

గుంటూరు: పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీకి షాకిచ్చిన జెడ్పీటీసీ అభ్యర్థి

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీకి జెడ్పీటీసీ అభ్యర్థి షాకిచ్చారు. విజయలక్ష్మి, భర్త వెంకట్‌తో కలిసి రాష్ట్ర అటవీ, విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే విడదల రజిని సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

Samayam Telugu 23 Jan 2021, 7:21 am
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలకానుంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీకి జెడ్పీటీసీ అభ్యర్థి షాకిచ్చారు. చిలకలూరిపేట మండలం జెడ్పీటీసీ అభ్యర్థిని వట్టిగుంట విజయలక్ష్మి, భర్త వెంకట్‌తో కలిసి రాష్ట్ర అటవీ, విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే విడదల రజిని సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. విజయలక్ష్మి, వెంకట్ దంపతుల్ని ప్రకాశం జిల్లా అద్దంకి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య చిలకలూరిపేటలోని పార్టీ ఆఫీసుకు తీసుకొచ్చి చేర్చారు.
Samayam Telugu చిలకలూరిపేట


ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్లు విజయలక్ష్మి అన్నారు. విజయలక్ష్మి మొదటి నుంచి వైఎస్సార్‌సీపీలోనే ఉన్నారట. ఆమె భర్త వెంకట్‌ పార్టీలో ఉన్నారని.. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్‌లో సంబరాలు చేసుకున్నారట. మళ్లీ ఎట్టకేలకు సొంత గూటికి చేరారట. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతన్న సమయంలో జెడ్పీటీసీ అభ్యర్థి ఇలా పార్టీ మారడం టీడీపీకి తలనొప్పిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.