యాప్నగరం

అరాచకం.. చరిత్రలో ఇలాంటిది లేదు.. దాడులపై జనసేనాని

టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై ఈ రోజు జరిగిన దాడులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి లేదని.. ఇది ఇలానే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి అడ్రస్‌గా మారుతుందన్నారు.

Samayam Telugu 19 Oct 2021, 10:15 pm
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై జరిగిన దాడులపై జనసేనాని స్పందించారు. పోలీసులు దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. అలా చేయకపోతే భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ అరచకానికి అడ్రస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ ఆఫీసులపై దాడులు జరగడం ఇదే ప్రథమమని తెలుస్తుందన్నారు.
Samayam Telugu జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్


ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం రోజు జరిగిన దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం క్షేమకరం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ నియంత్రణ పాటించాలని.. వ్యక్తిగత, పార్టీ ఆఫీసులు, నాయకుల ఇళ్లపై దాడులు చేయడం అరాచకానికి దారులు ఏర్పరచడమేనన్నారు. ఘటనలపై కేంద్ర హోం శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ దాడిలో దోషులను పట్టుకుని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ అరచకానికి అడ్రస్ అవుతుందన్నారు. తనకున్న సమాచారం మేరకు వైసీపీ శ్రేణులు చేశాయని అంటున్నారని.. ఒకవేళ నిజంగా ఈ దాడులకు పాల్పడింది వైసీపీ వారే అయితే... ఇలాంటి పోకడులు నియంత్రించుకోక పోతే మీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి గొడవలు జరగకుండా అందరూ ప్రశాంతంగా సంయమనం పాటించాలని పవన్ కల్యాణ్ కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.