యాప్నగరం

మంత్రి పదవి పోతే నా విశ్వరూపం చూపిస్తా.. కొడాలి నాని వ్యాఖ్యల వెనక మర్మమేంటి!

సీఎం జగన్మోహన్ రెడ్డి తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తే అప్పటి నుంచి తన విశ్వరూపం చూపిస్తానని మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును టార్గెట్ చేశారు.

Samayam Telugu 30 Mar 2022, 11:07 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను మంత్రి పదవి నుంచి తొలిగిస్తే తన విశ్వరూపం చూపిస్తానని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి పోతే.. తానకు చాలా భారం దిగుతుందని, అప్పటి నుంచి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తానని వ్యాఖ్యానించారు. దీంతో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Samayam Telugu కొడాలి నాని


మంత్రి పదవి తనకు అడ్డుగా ఉందని, ఇది లేకపోతే మరింత విశ్వరూపం చూపిస్తానని కొడాలి నాని వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. సీఎం జగన్ ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలా మార్కులు వేయించుకోవాలో తనకు తెలుసు అంటూ కొడాలి నాని కామెంట్స్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.


ఈ మేరకు మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి నుంచి తప్పించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలా మార్కులు వేయించుకోవాలో నాకు తెలుసు. నాకు మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి పోయినా ఫర్వాలేదు.. నేను బతికినంత కాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటా!

ఈ మంత్రి పదవి పోతే నా విశ్వరూపం చూస్తారు. వాస్తవానికి ఈ మంత్రి పదవి నాకు ఒక రకంగా అడ్డంగా ఉంది. ఎందుకంటే నేను ప్రభుత్వంలో భాగం.. నేను ఏం మాట్లాడినా ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తారు. అందుకే నాకు ఈ మంత్రి పదవి లేకపోతే ఫ్రీ బర్డ్ అయిపోతా.. అప్పటి నుంచి నా విశ్వరూపం చూస్తారు.


నేను వైసీపీలో ఏ పదవిని ఆశించి రాలేదు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను దారుణంగా వంచించి చంపేశారు. ఆయన నుంచి పదవిని, పార్టీ లాగేశారు. ఎన్టీఆర్ కుటుంబంలో మూడో తరాన్ని కూడా వదలట్లేదు. ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. నందమూరి హరికృష్ణ అభిమానిగా.. ఆయన్ను దగ్గరగా చూసిన వ్యక్తిగా, ఆయనపై ఉన్న అభిమానంతో, ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ఏమీ ఆశించకుండా వైసీపీలోకి వచ్చాను.

చంద్రబాబు అనే రాక్షసుడిని జగన్మోహన్ రెడ్డి మాత్రమే సంహరించగలడు. ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టగలడు, ఆయన ఆఖరి కోరికను తీర్చగలడు అని నమ్మి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చాను. ఎన్టీఆర్ కుటుంబం కోసం, ఆ ఫ్యామిలీలో మూడో తరాన్ని కూడా చంద్రబాబు చేస్తున్న అరచకాన్ని అరికట్టాలి, ఆయన ఆటలు సాగనివ్వకూడాదని ఈ పార్టీలోకి వచ్చాను. ఎన్టీఆర్ వాయిస్ ఈ ప్రజలకు పద వినిపించేందుకే ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వస్తున్నా.. నేను దాని కోసమే బతుకుతున్నా. మంత్రి పదవి పోయినా ఇబ్బంది లేదు.’’ అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.