యాప్నగరం

ఏపీ ప్రజలకు అలర్ట్: మాస్క్ పెట్టుకోకపోతే భారీ జరిమానా.. కలెక్టర్ ఇంతియాజ్ సంచలన ఆదేశాలు

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ప్రారంభమైన తరుణంలో కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 18 Apr 2021, 3:52 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కూడా కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై, ప్రతి ఒక్కరూ.. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. ఎవరైనా మాస్క్ లేకుండా బయలకు వస్తే వారిపై రూ. 500 జరిమానా విధించాలని రెవెన్యూ, పంచాయతీ, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
Samayam Telugu కలెక్టర్ ఇంతియాజ్


బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించకపోతే రూ. 500 జరిమానా విధిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. షాపింగ్ మాల్స్, థియేటర్స్, ఫంక్షన్ హాల్స్‌లో మాస్క్‌ ధరించకుంటే రూ.1,000 చొప్పున జరిమానా వేస్తామని స్పష్టం చేశారు. సోమవారం (ఏప్రిల్ 19వ తేదీ) నుంచి విజయవాడలో సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.