కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్ కలకలంరేపింది. హైవే పక్కనే యువకుల ఘర్షణకు దిగారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో ఓ యువకుడు చనిపోయినట్లు తెలుస్తోంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. విజయవాడ నుంచి వచ్చిన బ్యాచ్.. స్థానిక యువకులతో గొడవ పడ్డారని సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో విజయవాడలో గ్యాంగ్ వార్ జరిగింది.. ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన కలకలంరేపింది. ఇప్పుడు మళ్లీ ఇబ్రహీంపట్నంలో గొడవ సంచలనంగా మారింది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని జూపూడి గ్రామ శివారులో డాక్టర్ ఎన్టీటిపీస్ బూడిద కరకట్ట నుండి మురుగు నీరు వాటర్ పాల్స్ తరహాలో వస్తుంటుంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది యువకులు అక్కడికి వస్తున్నారు. సరదాగా నీటిలో ఆడుతూ వాటర్ ఫాల్స్ అన్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఫ్రెండ్షిప్ డే, ఆదివారం కావడంతో యువకులు అక్కడికి వచ్చారు. అక్కడ ఏం జరిగింది ఏమో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇబ్రహీంపట్నంలో రోడ్డు పక్కనే యువకుల గ్యాంగ్ వార్.. పిడి గుద్దులకు ఒకరి మృతి
ఇబ్రహీంపట్నం సమీపంలో గ్యాంగ్ వార్. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో ఓ యువకుడు చనిపోయినట్లు తెలుస్తోంది.
Samayam Telugu 2 Aug 2021, 10:27 am
ప్రధానాంశాలు:
- ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్
- ఒకరిపై మరొకరు పిడి గుద్దులు
- సోషల్ మీడియాలో వీడియో