యాప్నగరం

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఘోరం: విద్యార్థినులు లంచ్‌కు వెళ్లొచ్చి చూస్తే.. షాకింగ్!

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడో సంవత్సరం విద్యార్థిని..!

Samayam Telugu 29 Mar 2021, 7:57 pm
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలోని శ్రీకాకుళం క్యాంపస్‌కు చెందిన ఓ విద్యార్థిని సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ గాంధీనగర్‌లోని గొల్లపేటకు చెందిన గోవింద్ కుమార్తె ఎం‌.మాధురి (20) నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది.
Samayam Telugu నూజివీడు ట్రిపుల్ ఐటీ


సోమవారం ‘హోలీ’ పండుగ సందర్భంగా సెలవు కావడంతో విద్యార్థులంతా హాస్టల్‌లో ఉన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజన సమయం కావడంతో సహచర విద్యార్థులు భోజనానికి వెళ్లారు. ఈ సమయంలో మాధురి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం భోజనం చేసి రూంకి చేరుకున్న విద్యార్థినులు గదికి తలుపు వేసి ఉండటం గమనించారు. కిటికీ నుంచి లోపలికి చూసి షాక్‌కు గురయ్యారు.
మాధురి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సహచర విద్యార్థినులు హాస్టల్ సిబ్బంది తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ వెంకటరమణ, ఎస్సై గణేశ్‌ బాబు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని మృతికి ప్రేమ వ్యవహారమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.