ఓ యువకుడిని కొందరు టార్గెట్ చేసి ఎగతాళి చేస్తుండటంతో.. అతడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అసలేం జరిగిందే.. కృష్ణా జిల్లా, అవనిగడ్డ 3వ వార్డుకు చెందిన మెండు సూర్యకుమార్ గత కొద్ది రోజులుగా కొరియర్ బాయ్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆటో కిస్తీ విషయానికి సంబంధించి తన మిత్రులతో వివాదం ఏర్పడింది.
వారి మధ్య మాటా మాటా పెరిగి గత నెలలో కొట్లాట కూడా జరిగింది. ఆ సమయంలో ఇరువురివైపు పెద్దలు రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉన్నారు. అంతా సర్దుకుంటోంది అనుకునే సమయంలో.. ఇటీవల కాలంలో స్నేహితులు మళ్లీ ఎగతాళి చేయడం ప్రారంభించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్య కుమార్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సూర్య కుమార్ను స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సూర్యకుమార్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉండటంతో.. అవనిగడ్డ కోర్టు న్యాయమూర్తి జీవీఎల్ సరస్వతి, ఆస్పత్రికి వచ్చి సూర్యకుమార్ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం సూర్యకుమార్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవికుమార్ తెలిపారు. సూర్యకుమార్ బంధువుల ఫిర్యాదును కూడా నమోదు చేసుకున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.
వారి మధ్య మాటా మాటా పెరిగి గత నెలలో కొట్లాట కూడా జరిగింది. ఆ సమయంలో ఇరువురివైపు పెద్దలు రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉన్నారు. అంతా సర్దుకుంటోంది అనుకునే సమయంలో.. ఇటీవల కాలంలో స్నేహితులు మళ్లీ ఎగతాళి చేయడం ప్రారంభించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్య కుమార్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సూర్య కుమార్ను స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సూర్యకుమార్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉండటంతో.. అవనిగడ్డ కోర్టు న్యాయమూర్తి జీవీఎల్ సరస్వతి, ఆస్పత్రికి వచ్చి సూర్యకుమార్ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం సూర్యకుమార్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవికుమార్ తెలిపారు. సూర్యకుమార్ బంధువుల ఫిర్యాదును కూడా నమోదు చేసుకున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.