యాప్నగరం

NTRతో నా వివాహం చంద్రబాబుకు ఇష్టం లేదు.. వారిపై కేసు పెడతా: లక్ష్మీ పార్వతి

Ntr Health University పేరు మార్పు వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. పేరు మార్పు నేపథ్యంలో మీడియాలో తనపై వస్తున్న కథనాలపై లక్ష్మీ పార్వతి (Laxmi Parvathi) తీవ్రంగా మండిపడ్డారు. తన వ్యక్తిగత జీవింపై కొన్ని మీడియా సంస్థలు దాడి చేసి.., ఇష్టానుసారం తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్న వారిపై కేసులు పెడతానని ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా (YSR Health University) పేరు మారుస్తూ తీసుకొచ్చిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

Authored byసందీప్ పూల | Samayam Telugu 26 Sep 2022, 12:45 pm
Ntr Health University పేరు మార్పు నేపథ్యంలో మీడియాలో తనపై వస్తున్న కథనాలపై లక్ష్మీ పార్వతి (Laxmi Parvathi) తీవ్రంగా మండిపడ్డారు. తన వ్యక్తిగత జీవింపై కొన్ని మీడియా సంస్థలు దాడి చేసి.., ఇష్టానుసారం తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వైవాహిక జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. అందరి సమక్షంలోనే ఎన్టీఆర్‌తో తన వివాహం జరిగిందని చెప్పారు. ఎన్టీఆర్‌తో తన వివాహం జరగటం చంద్రబాబుకు మెుదట్నుంచి ఇష్టం లేదని అన్నారు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసినవారే.. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడి ప్రేమను ఒలకబోస్తు్న్నారని అన్నారు. తనపై ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్న వారిపై కేసులు పెడతానని ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Samayam Telugu laxmi parvathi new
లక్ష్మీ పార్వతి


"చంద్రబాబు ఎల్లో మీడియాలో నాపై పిచ్చిరాతలు రాయిస్తు్న్నారు. ఎన్టీఆర్‌పై నాకున్న అభిమానం అందరికి తెలుసు, ఎలాంటి స్వార్థం కోసం నేను ఎన్టీఆర్ (NTR) జీవితంలోకి అడుగు పెట్టలేదు. ఏనాడు పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. నాకు అధికార దాహం ఉంటే ఆనాడు చంద్రబాబుకు రెండు పదవులు వచ్చేవా ?. చంద్రబాబు నమ్మించి గొంతుకోస్తాడని ఎన్టీఆర్‌ నాతో చాలాసార్లు చెప్పారు. అల్లుళ్ల కొట్లాట వల్లే 1989 ఎన్నికల్లో ఓడియామని స్వయంగా ఎన్టీఆర్ ఆనాడు చెప్పారు. నేను ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించాక టీడిపీ (TDP) ఘన విజయం సాధించింది." అని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యనించారు.

విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి 1992లో ఎన్టీఆర్ పేరుపెట్టగా.. ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలని జగన్ సర్కారు నిర్ణయించింది. డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ (Ntr Health University) పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ (Ap Assembly)లో ఆమోదం లభించింది. యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెడుతూ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లును వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని సభలో ప్రవేశపెట్టారు. చర్చ తర్వాత ఈ బిల్లు శాసనసభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రకటించారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University) పేరు మార్పు వ్యవహారం ఏపీలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీతో పాటూ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే నందమూరి కుటుంబ సభ్యులు స్పందించారు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయన్ని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతిపైనా కొందరు విమర్శలు చేశారు. దీంతో ఆమె ప్రెస్ మీట్ పెట్టి తనపై చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.