యాప్నగరం

విజయవాడలో మరో ఘటన.. సీతమ్మ విగ్రహం ధ్వంసం

ఆలయాలపై విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీతారామమందిరంలో ఉన్న సీతమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

Samayam Telugu 3 Jan 2021, 10:41 am
ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా రామతీర్థం రగడ సద్దుమణుగముందే.. మరోచోట దేవతా విగ్రహంపై దాడి జరిగింది. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదం ఘటన మరువక ముందే తాజాగా విజయవాడలో మరో ఘటన చోటు చేసుకుంది. విజయవాడ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న సీతారామమందిరంలో సీతమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ వార్త తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Samayam Telugu విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం
lord seetha idol destroyed


Read More: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే సర్వదర్శనం టోకెన్లు

మరోవైపు రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు పార్టీలకు చెందిన నాయకులు రామతీర్థంలో పర్యటిస్తున్నారు. ఇటు అధికార పార్టీకి చెందిన మంత్రలు, నాయకులు సైతం రామతీర్థంలో పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామతీర్థం ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడి దేవాలయంలో విగ్రహం ధ్వంసం కావడం, రాజకీయ రంగు పులుముకుని, ప్రధాన పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.