యాప్నగరం

గుంటూరు: తాపీ మేస్త్రితో ఇంటర్ అమ్మాయి ప్రేమ.. భయంతో పెళ్లి చేసుకుని, చెట్టుకు ఉరి!

ప్రదీప్తి ఇంటర్ చదువుతుండగా.. కిరణ్ తాపీ మేస్త్రి. ఇద్దరు కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ​​ప్రదీప్తి, కిరణ్‌ల ప్రేమ వ్యవహారం ఇద్దరి తల్లిదండ్రులకు తెలియడంతో మందలించినట్లు సమాచారం.

Samayam Telugu 18 Jan 2021, 1:01 pm
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. వివేకానంద నగర్‌లో ప్రేమికుల ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ప్రదీప్తి ఇంటర్ చదువుతుండగా.. కిరణ్ తాపీ మేస్త్రి. ఇద్దరు కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమకు పెద్దలు నిరాకరించటంతో మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఇద్దరు పెళ్ళి చేసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Samayam Telugu సత్తెనపల్లిలో విషాదం


ఇటీవల ప్రదీప్తి, కిరణ్‌ల ప్రేమ వ్యవహారం ఇద్దరి తల్లిదండ్రులకు తెలియడంతో మందలించినట్లు సమాచారం. కిరణ్ కొద్దిరోజులుగా తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు.. అతడు సంక్రాంతి పండుగ కావడంతో సొంత ఊరికి వచ్చినట్లు చెబుతున్నారు. పెద్దలు తమను విడదీస్తారనే భయంతో పెళ్లి చేసుకుని మరీ ఆత్మహత్య చేసుకోవగం తీవ్ర విషాదాన్ని నింపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.