యాప్నగరం

కొంపముంచిన వివాహేతర సంబంధం.. భర్త లేడని.. ప్రియుడి ఉన్మాదం

వివాహేతర సంబంధం ఆమె కొంపముంచింది. ఆగ్రహానికి గురైన ప్రియుడు కనీసం కనికరం లేకుండా ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన విజయవాడ సమీపంలో జరిగింది.

Samayam Telugu 13 Jun 2021, 5:36 pm
కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్మాదిగా మారిన ప్రియుడు భర్త లేని మహిళపై యాసిడ్ దాడికి తెగబడ్డాడు. మైలవరం మండలం గణపవరం గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఒంటరి మహిళ కట్టా వెంకాయమ్మ(38) గోపీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరి మధ్య కొద్దికాలంగా మనస్పర్థలు తలెత్తాయి. తరచూ గొడవపడుతున్నారు. ప్రియురాలిపై ఆగ్రహం చెందిన గోపి బాత్రూమ్‌లో వాడే యాసిడ్‌తో దాడి చేయడంతో ఆమె ఒంటిపై మంటలు వచ్చాయి. బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.