యాప్నగరం

తమ్ముడి ఇంట్లో దాక్కున్న భార్య, పిల్లలు.. చిన్న అబద్ధం.. ప్రాణం తీసింది..!

NTR Districtభవానీపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, పిల్లలు తనను విడిచి పుట్టింటికి వెళ్లిపోయారనుకుని మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు.

Samayam Telugu 13 Apr 2022, 8:26 am
చిన్న అబద్ధం ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైంది. భార్య, పిల్లలు తనను విడిచి పుట్టింటికి వెళ్లిపోయారన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా భవానీపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


కబేళా సెంటర్‌ కొండ ప్రాంతానికి చెందిన పాలొట్టి నాగబాబు (38) అనే వ్యక్తి చిత్తు కాగితాల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే తాగుడుకు బానిసనై నాగబాబు.. నిత్య మద్యం తాగొచ్చి భార్యను కొట్టి వేధిస్తున్నాడు. ఇటీవల శ్రీ రామనవమి పండుగ రోజు కూడా తాగొచ్చి కొట్టడంతో.. ఈ విషయాన్ని సమీపంలో నాగబాబు సోదరుడు దుర్గా ప్రసాద్‌కు విషయం చెప్పింది. అయితే రెండు పిల్లలతో వచ్చి తమ ఇంట్లో ఉండాలని అతను వదినకు సూచించాడు.

దీంతో ఆమె తన పిల్లలతో కలిసి మరిది దుర్గాప్రసాద్‌ ఇంట్లో తలదాచుకుంది. ఈ నెల 11న ఉదయం నాగబాబు తన సోదరుడి ఇంటికి వచ్చి తన భార్య, పిల్లలు ఏరంటూ ఆరాతీశాడు. 'నువ్వు తాగి కొట్టడంతో భయంతో వదిన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది..' అని దుర్గా ప్రసాద్ అన్నకు చెప్పాడు. దీంతో నాగబాబు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అనంతరం నాగబాబుకు కుటుంబసభ్యులు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అనుమానంతో ఇంటికి వెళ్లి చూడగా.. తలుపులకు లోపల గడివేసి ఉన్నాయి. తలుపులు బద్దలు గొట్టి చూడగా.. లోపల ఇనుపరాడ్‌కు కేబుల్‌ వైర్‌తో ఉరివేసుకుని నాగబాబు కనిపించాడు. మృతుడి భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు.. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.