యాప్నగరం

బెజవాడలో ఘోరం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య

పట్టపగలు నడిరోడ్డుపై ప్రత్యర్థిని దారుణంగా నరికి చంపేశారు దుండగులు. కత్తులతో వెంటాడి అతి కిరాతకంగా అంతం చేశారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Samayam Telugu 25 Jun 2021, 2:30 pm
విజయవాడలో పట్టపగలు ఘోరం జరిగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హతమార్చారు. కత్తులతో వెంటాడిన దుండగులు అతి కిరాతకంగా నరికి చంపేశారు. నగరంలోని దుర్గ అగ్రహారం ఏరియాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కత్తులతో విచక్షణా రహితంగా నరకడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Samayam Telugu హత్యకు గురైన వ్యక్తి
vijayawada


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.