యాప్నగరం

మచిలీపట్నం: కారు ఢీకొని ఎగిరిపడిన బైకర్.. స్పాట్‌లోనే..

కృష్ణా జిల్లాలో కారు ఢీకొని యువకుడు మృత్యువాతపడ్డాడు. వేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ని ఢీకొని పొదల్లోకి దూసుకుపోయింది.

Samayam Telugu 20 Dec 2020, 5:13 pm
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన మచిలీపట్నం మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీ శివారులోని శ్రీనివాస నగర్‌ వద్ద చోటుచేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ని అమాంతం ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న యువకుడు ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. తలకి రోడ్డు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. బైక్‌ని ఢీకొట్టిన కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటన వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారులో ఉన్న వ్యక్తి సురక్షితంగా ఉన్నాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu మచిలీపట్నం రోడ్డు ప్రమాదం
accident


Also Read: పెళ్లైన అక్కపై కన్నేసిన తమ్ముడు.. అర్ధరాత్రి నిద్రిస్తుండగా.. నీచం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.