యాప్నగరం

శివరాత్రి పర్వదినం.. దుర్గమ్మకు చేనేత వస్త్రాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించే దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల కళ్యాణోత్సవం కోసం మంగళగిరికి చెందిన చేనేతకారులు అమ్మవారికి చేనేత వస్త్రాలను సమర్పించారు.

Samayam Telugu 11 Mar 2021, 6:17 pm
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి శివభక్త మార్కండేయ వంశీకులు గురువారం చేనేత వస్త్రాలను బహుకరించారు. మంగళగిరిలో చేనేత మగ్గాలపై వారం రోజులపాటు ప్రత్యేకంగా ఈ వస్త్రాలను తయారు చేయించారు. శివరాత్రి సందర్భంగా జరిగే దుర్గామల్లేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం సందర్భంగా.. శివభక్త మార్కండేయ వారసులు అమ్మవారికి చేనేత పట్టు చీరె, స్వామివారికి శేషవస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.
Samayam Telugu vijayawada durga temple.


ఈ ఏడాది ఉత్సవానికి ఆప్కో చైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు, పద్మావతి దంపతులు ప్రధాన కైంకర్య పరులుగా వ్యవహరించారు. మంగళగిరి మార్కండేయ పద్మశాలీయ యువజన సంఘం కన్వీనర్ దామర్ల వెంకట నరసింహం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చిల్లపల్లి నాగవెంకట మోహనరావు, గంజి చిరంజీవి సతీసమేతంగా పట్టువస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమ, విభూది, ఫలపుష్పాలను 14 వెదురు పళ్లెములలో కూర్చి ఆలయానికి చేరుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎంవీ సురేష్‌బాబుకు పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో సురేష్‌బాబు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.