యాప్నగరం

విజయవాడ: పిల్లలు వాంతులు చేసుకుంటున్నారని అడిగితే.. షాకిచ్చిన తల్లి

మతిస్థిమితం లేని తల్లి చేతిలో ఇద్దరు పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయే షాకింగ్ ఘటన వెలుగుచూసింది. సకాలంలో స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

Samayam Telugu 13 Jan 2021, 7:41 pm
పిల్లలు వాంతులు చేసుకుంటున్నారేంటి అని అడిగిన స్థానికులకు మతిస్థిమితం లేని తల్లి ఊహించని షాకిచ్చింది. భోజనంలో విషం కలిపానని.. తాను కూడా తిన్నానని చెప్పడంతో కంగుతిన్నారు. వెంటనే తేరుకుని తల్లితో సహా పిల్లలను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ షాకింగ్ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
mother


కంకిపాడు మండలం పునాదిపాడుకి చెందిన కనక భవానికి ఇద్దరు పిల్లలు జ్యోతి(7), కుమార్(5). ఆమెకు కొద్దికాలంగా మతిస్థిమితం లేదు. మధ్యాహ్న భోజనం అనంతరం ఇద్దరు చిన్నారులు వాంతులు చేసుకోవడం గమనించిన స్థానికులు ఏమైందని ఆరా తీశారు. మతిస్థిమితం లేని కనక భవాని చెప్పిన విషయం విని షాకయ్యారు. భోజనంలో ఎలుకల మందు కలిపి పెట్టానని.. తాను కూడా తిన్నానని చెప్పడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.

తల్లి కనకభవాని, ఆమె ఇద్దరు చిన్నారులను వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్పత్రి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.