యాప్నగరం

'NTR అంత చేతకాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడు'..ఏపీ మినిస్టర్ దాడిశెట్టి రాజా సంచలన కామెంట్స్

NTR Health University పేరు మార్పు అంశం ఏపీలో అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. పేరు మార్పు అంశంపై అధికార ప్రతిపక్ష నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌పై మినిస్టర్ దాడిశెట్టి రాజా (Dadisetty raja) నోటికి పని చెప్పారు. ఎన్టీఆర్ (NTR) అంత చేతకాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి రెండు సార్లు వెన్నుపోట్లు పొడిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని విమర్శించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 26 Sep 2022, 4:44 pm
NTR Health University పేరు మార్పు అంశం ఏపీలో రాజకీయ దుమారాన్నే రేపింది. అధికార ప్రతిపక్ష నేతలతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. పేరు మార్పు అంశాన్ని అధికార పార్టీ నేతలు, మంత్రులు సమర్థిస్తుంటే.., ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో ఎన్టీఆర్ అంటే తనకూ అభిమానం ఉందంటూ సీఎం జగన్ (YS Jaganmohan Reddy) కన్విన్సింగ్‌గా మాట్లాడుతుంటే.., మంత్రి దాడిశెట్టి రాజా (Dadisetty Raja) మాత్రం తన నోటికి పని చెబుతూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.
Samayam Telugu dadisetty raja new.
దాడిశెట్టి రాజా


ఎన్టీఆర్ (NTR) అంత చేతకాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి రెండు సార్లు వెన్నుపోట్లు పొడిపించుకున్న వ్యక్తి అని విమర్శించారు. సీఎంగా ఉండి కూడా నాదెండ్ల భాస్కర్ రావు(Nadendla Bhasker Rao), చంద్రబాబుతో (Chandrababu) రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్నారంటూ మండిపడ్డారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి (YS Rajashekar Reddy) ఎన్టీఆర్‌కు అసలు పోలికే లేదని అన్నారు.

విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి 1992లో ఎన్టీఆర్ పేరుపెట్టగా.. ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలని జగన్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ (Ntr Health University) పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ (Ap Assembly)లో ఆమోదం లభించింది. యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెడుతూ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లును వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని సభలో ప్రవేశపెట్టారు. చర్చ తర్వాత ఈ బిల్లు శాసనసభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రకటించారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.