యాప్నగరం

AP High Court: కొడాలి నానికి ఊరట.. మధ్యంతర ఉత్తర్వులు జారీ!

SEC vs Kondali Nani | కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మీడియాతో ఆయన మాట్లాడొచ్చంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Samayam Telugu 18 Feb 2021, 6:48 pm
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి హైకోర్టు ఊరటనిచ్చింది. మీడియాతో మాట్లాడొచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఎస్‌ఈసీ, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21 వరకు మీడియాతో మాట్లాడొద్దంటూ.. ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ... మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. మధ్యేమార్గంగా తగిన ఉత్తర్వులు జారీచేస్తామని బుధవారం తెలిపింది.
Samayam Telugu kodali nani fb


ఈ కేసులో ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. ‘మంత్రిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగ సంస్థ ఎస్‌ఈసీని గౌరవించాలి. మంత్రి వ్యాఖ్యలు ప్రజల్లో ఎస్‌ఈసీ అసమర్థులనే భావన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడకుండా మంత్రిని నిలువరించాల్సి వచ్చింది’ అని బుధవారం తన వాదనలు వినిపించారు.

మంత్రి తరఫున న్యాయవాది ప్రశాంత్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణ విషయంలోనే ఎన్నికల కమిషనర్‌కు పూర్తి అధికారాలు ఉంటాయి గానీ, మాట్లాడే స్వేచ్ఛను హరించేలా ఉత్తర్వులివ్వడానికి వీల్లేదని ఆయన వాదించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.