యాప్నగరం

ఉచిత విద్యుత్‌పై పెద్దిరెడ్డి క్లారిటీ.. ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు

ఉచిత విద్యుత్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దంటూ ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు కరెంట్ బిల్లుల కోసం ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై సంపూర్ణ హక్కు కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వివరించారు.

Edited byరావు | Samayam Telugu 8 Aug 2022, 2:23 pm

ప్రధానాంశాలు:

  • ఉచిత విద్యుత్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
  • రైతులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 97 శాతం మంది రైతులు అంగీకరించారు: మంత్రి పెద్దిరెడ్డి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu peddireddy rama chandra reddy
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఉచిత విద్యుత్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దంటూ ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు కరెంట్ బిల్లుల కోసం ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై సంపూర్ణ హక్కు కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ మేరకు ఉచిత విద్యుత్ అమలుపై విద్యుత్ శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు.
రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకం, వ్యవసాయానికి 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్ అమలుపై ఆయన అధికారులతో మాట్లాడారు. వ్యవసయానికి నెలవారీ విద్యుత్ బిల్లులు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. రైతుల ఖాతాల నుంచి నేరుగా డిస్కంలకు బిల్లులు చెల్లించడం ద్వారా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రైతే డిమాండ్ చేసే హక్కు లభిస్తుందని మంత్రి చెప్పారు. విద్యుత్ సంస్థలకు వివిధ కారణాల వల్ల వచ్చే నష్టాలను రైతులపైకి నెట్టేయకుండా ఈ విధానంతో నిరోధించొచ్చని ఆయన వివరించారు.

ఒక్కో రైతుకు ఎన్నెన్ని విద్యుత్ కనెక్షన్లు ఉండాలనే అంశంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. అనధికార, అధిక లోడ్ కనెక్షన్లు కూడా క్రమబద్ధీకరిస్తామని పెద్దిరెడ్డి అన్నారు. కౌలు రైతులకు కూడా ఈ విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తవని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన నగదు బదిలీ పథకం విజయవంతమైందని.. మీటర్లు బిగించడం వలన 33.75 మిలియన యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని పెద్దిరెడ్డి చెప్పారు. మీటర్ల ఏర్పాటు, నగదు బదిలీ పథకానికి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా 97 శాతం రైతులు అంగీకార పత్రాలను అందజేశారని పేర్కొన్నారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.