యాప్నగరం

టీడీపీ నేతలు అర్జునుడు, పట్టాభికి ఝలక్.. అన్నంత పనిచేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Mla Vallabhaneni Vamsi టీడీపీ నేతలకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సంకల్ప సిద్ధి వ్యవహారంలో తనపై చేసిన వ్యాఖ్యలపై గన్నవరం కోర్టును ఆశ్రయించారు.. ఇద్దరిపై పరువు నష్టం దావా వేశారు. గతంలో నోటీసులు ఇచ్చినా ఇద్దరు రిప్లై ఇవ్వలేదని.. అందుకే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. టీడీపీకి మద్దతుగా ఉంటే.. ఒకలా బయటకు వస్తే మరోలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కచ్చితంగా వారికి శిక్ష పడాలన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 30 Jan 2023, 1:35 pm

ప్రధానాంశాలు:

  • టీడీపీ నేతలకు వల్లభనేని వంశీ ట్విస్ట్
  • గన్నవరం కోర్టులో పరువు నష్టం దావా
  • గతంలో నోటీసులిచ్చినా నో రిప్లై
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vallabhaneni Vamsi Mohan
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) టీడీపీ నేతలకు ట్విస్ట్ ఇచ్చారు. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ బచ్చుల అర్జునుడు, మరో నేత పట్టాభిపై స్థానిక కోర్టులో ఎమ్మెల్యే వంశీ పరువునష్టం దావా వేశారు. తాను 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచానని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు పథకాలకు ఆయాకర్షితుడనై మద్దతు తెలిపాను అన్నారు. అందుకు టీడీపీకి చెందిన కొంత నాపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు ద్వారా దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. టీడీపీకి మద్దతుగా ఉంటే.. ఒకలా బయటకు వస్తే మరోలా దుష్ప్రచారం చేయడం అలవాటన్నారు.
విజయవాడలో సంకల్ప సిద్దిలో అవినీతి జరిగిందని కొన్ని మీడియాల ద్వారా తెలిసిందన్నారు వంశీ. రాజకీయ జీవితంలో ఒక్క అవినీతికి కూడా పాల్పడని తనపై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారని.. టీడీపీకి చెందిన పట్టాభి, బచ్చుల అర్జునుడు తీవ్ర పదజాలంతో అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేశారన్నారు. తాను, కొడాలి నాని కోట్లు అవినీతి చేసి బెంగుళూరులో ఆస్తులు కొన్నట్లు మీడియాలో ప్రకటనలు ఇచ్చారన్నారు.

ఈ సంకల్ప సిద్ది విషయంలో గతంలో ఇచ్చిన నోటీస్‌కి రిప్లై ఇవ్వలేదన్నారు గన్నవరం ఎమ్మెల్యే. టీడీపీ నేతలు రిప్లై ఇవ్వని కారణంగా ఇవాళ గన్నవరం కోర్టుని ఆశ్రయించాను అన్నారు. తనపై కావాలని తీవ్ర పదజాలంతో మీడియాలో ప్రకటనలు చేసిన వారికి శిక్ష వేయాలని కోరారు వంశీ. గన్నవరం కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.

సంకల్ప సిద్ధి కేసు విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని గతంలోనే వంశీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. పట్టాభి, బచ్చుల అర్జునుడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఈ సంకల్ప సిద్ధి కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని.. అసలు వాళ్లెవరో కూడా తనకు తెలియదన్నారు. గతేడాది సంక్రాంతి సమయంలో కూడా తాను క్యాసినో పెట్టానని తప్పుడు ప్రచారం చేశారని.. ఇప్పుడు మళ్లీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.