యాప్నగరం

ఒక్కోసారి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేను ఎందుకయ్యానా అని బాధపడుతున్నా: వైసీపీ ఎమ్మెల్యే

Vasantha Krishna Prasad ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత రోజుల్లో రాజకీయాలను ఇప్పుడున్న రాజకీయాలతో పోలుస్తూ తన అభిప్రాయాలను చెప్పారు.లవరం మండలం చంద్రాల సొసైటీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రౌడీలను వెంటేసుకుని వారిలా ప్రవర్తిస్తేనే ముందడుగు వేసేలా పరిస్థితులు ఉన్నాయన్నారు. పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక తాను ఇంకా పాతతరం నాయకుడిగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు మైలవరం ఎమ్మెల్యే వసంత.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 10 Jan 2023, 7:16 am

ప్రధానాంశాలు:

  • మైలవరం ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
  • పాత రోజుల్ని గుర్తు చేసుకున్న వసంత
  • రాజకీయాలపై అభిప్రాయాలు చెప్పారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vasantha Krishna Prasad
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ (Vasantha Krishna Prasad) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయం చేస్తోందని.. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. పాతా రోజులతో పోల్చితే ప్రస్తుత రాజకీయాలు గణనీయంగా మార్పు చెందాయన్నారు. పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక తాను పాతతరం నాయకుడిగానే మిగిలిపోయానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ భవన శంకుస్థాపనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒక్కోసారి రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యేను ఎందుకయ్యానా అని బాధపడుతున్నానని కామెంట్ చేశారు. సగటు వ్యక్తులకు కొన్నిసార్లు సాయం చేయలేకపోతున్నామని అన్నారు. రౌడీలను వెంటేసుకుని వారిలా ప్రవర్తిస్తేనే ముందడుగు వేసేలా ఉన్నాయన్నారు. తాను గత మూడున్నరేళ్లలో ఎక్కడా అక్రమ కేసులు పెట్టించలేదని వ్యాఖ్యానించారు. పథకాలు ఆపలేదని.. కేసుల విషయంలో కొంతమంది తమ నాయకులకు తనపై అసంతృప్తి ఉండొచ్చన్నారు.

మైలవరం మండలంలోని చంద్రాలలో రూ.32.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో 20 వేల మందికి ఇళ్లస్థలాలను మంజూరు చేస్తే.. చంద్రాలలో 360 మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేశామన్నారు. ఇక్కడ ఇంకా అర్హులైన వారికి ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు. ఒకసారి స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకునే సంస్కృతి తమది కాదన్నారు. ఇళ్లస్థలాల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు.

గత ప్రభుత్వాలు మాదిరిగా జెండా కడితేనే సంక్షేమ పథకాలను వర్తింప చేసే విధానం కాదన్నారు. కులం, మతం, వర్గం చూడకుండా అర్హతలే ప్రామాణికంగా ఇళ్ల ముంగిటకే వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారననారు. సొసైటీల ద్వారా తక్కువ వడ్డీకి అందిస్తున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నదాతల శ్రేయస్సు కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని.. వాటిని సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్ధిక వృద్ధి సాధించాలన్నారు. ఈ సభలో వసంత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అంతేకాదు ఎమ్మెల్యే వసంత ఇటీవల గుంటూరు తొక్కిసలాట ఘటనపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. సేవను రాజకీయ కారణాలతో విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. భయపెడితే వారు సేవా కార్యక్రమాలెలా చేస్తారని.. వారి సాయాన్ని ఆపాలనుకోవటం మంచి పద్దతి కాదన్నారు. ఎన్నారై, ఉయ్యూరు ఫౌండేషన్‌ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ మంచి వ్యక్తి అన్నారు. తనకు స్నేహితుడని.. అనవసరంగా ఆయనపై ఏవేవో చెప్పి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గుంటూరులో తొక్కిసలాట దురదృష్టకరమని.. ఈ ఘటనను చిలవలు, పలవలు చేసి చూడడం మంచిది కాదన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.