యాప్నగరం

ఆ క్రెడిట్ టీడీపీ ఎంపీకి దక్కుతుంది.. వైసీపీ ఎమ్మెల్యే పొగడ్తలు

Nandigama Mla మొండితోక జగన్మోహనరావు ఎంపీ కేశినేని నానిని ప్రశంసించారు. తన నియోజకవర్గం కోసం ఎంపీతో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజలకు మంచి చేయడానికి పార్టీలతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. తామిద్దరం కలిసి ఎందుకు పనిచేయకూడదని ప్రశ్నించారు. తమ పార్టీ కూడా ఈ విషయంలో పాజిటివ్‌గా ఉంటుందని.. నాని, తాను కలిసి పనిచేయడం ఏమైనా నేరమా అన్నారు. ఆయన తనకు 2014 ఎన్నికల ఫలితాల సమయం నుంచి పరిచయం అయ్యారన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 23 May 2023, 1:47 pm

ప్రధానాంశాలు:

  • కేశినేని నానిపై వైసీపీ ఎమ్మెల్యే పొగడ్తలు
  • ఇద్దరం కలిసి పనిచేస్తామన్న జగన్మోహనరావు
  • ప్రజలకు మంచి చేయడం కోసమే అన్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani), నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. పార్టీలు పక్కన పెట్టి జనాలకు మంచి చేస్తామంటూ ఇద్దరూ దూకుడు పెంచారు. తాజాగా కేశినేని నాని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు (Monditoka Jagan Mohan Rao) స్పందించారు. టాటా ట్రస్ట్ తీసుకువచ్చి ప్రజలకు సేవ చేసిన ఘనత కేశినేని నానికి మాత్రమే దక్కుతుందన్నారు. మంచిని మంచి అని చెప్తే తప్పుగా భావిస్తున్నారా.. ఎంపీ కేశినేని మంచి చేశారు కాబట్టే తనను ప్రశంసించారన్నారు.
ప్రజా ప్రతినిధులం కాబట్టి తాము ఎప్పుడూ ఎంపీ కేశినేనితో మాట్లాడతామని.. ఆయన దగ్గరకు వెళతామన్నారు. తన పార్టీ సిద్ధాంతమే కులాలకు మతాలకు సేవ చేయమని చెప్పిందని.. అలాంటప్పుడు కేశినేని నాని, తాను కలిసి ఎందుకు పనిచేయకూడదని ప్రశ్నించారు. ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ప్రజలకోసం పనిచేయాలని.. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఎంపీ కేశినేని నాని, తాము అడుగుల వేస్తున్నామన్నారు.

కేశినేని నాని ప్రజల కోసం పనిచేస్తారని.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ కోసం కాదని ఆయన నిరూపించుకున్నరని ఎమ్మెల్యే జగన్మోహనరావు వ్యాఖ్యానించారు. తమని వసూల్ బ్రదర్స్ అనే వారు.. తాము చేసిన తప్పులను బయట పెట్టాలని మాజీ ఎమ్మెల్యే సౌమ్యకు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ తప్పు చేస్తే తాను కూడా టీడీపీని విమర్శిస్తానని.. వైఎస్సార్‌సీపీ తప్పు చేస్తే కేశినేని నాని కూడా విమర్శిస్తారన్నారు. అభివృద్ధి పనులు కోసం తామిద్దరం ఎందుకు కలిసి పనిచేయకూడదని.. అది నేరమా అంటూ ప్రశ్నించారు.

ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తున్నాం కాబట్టే ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతున్నామన్నారు. ప్రోటోకాల్ విషయంలో సముచిత స్థానం కల్పిస్తాన్నారు. కేశినేని నానిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా తాను పొగడటంలో తమ పార్టీకి సంకుచిత భావాలు లేవన్నారు. ఏడు స్థానాల్లో 6 స్థానాలు వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఎంపీగా ప్రజలకు సేవ చేయబట్టే కేశినేని నాని గెలిచారనేది వాస్తవం అన్నారు. ప్రజలు గెలిపించిన తర్వాత సేవ చేయాల్సిందే అన్నారు.

ఒకే రకంగా ఆలోచించే వాళ్లు, అభివృద్ధిని కొరుకునేవాళ్లు ఒకే వేదిక పంచుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అటువంటి సంప్రదాయాలు తనకు వద్దని.. తాను ఎవరితోనైనా మాట్లాడతాను అన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో ఎదురుపడితే నమస్కారం పెడతామని.. విమర్శలు వేరు గౌరవం వేరు అన్నారు. ఎవరి పార్టీలు వారివి ఎవరి సిద్ధాంతాలు వారివి అని వ్యాఖ్యానించారు. అంటు కేశినేని నాని కూడా అదే అంటున్నారు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తాను అన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.