Gannavaram: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఒక NRI యువకుడిని.. కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం పట్టణానికి చెందిన పొందూరి అంజన్ అనే యువకుడిని.. పోలీసులు అదుపులో తీసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంజన్ (NRI Anjan) అరెస్టుపై అతని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పోలీసులు మాత్రం ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికాలో మెకానికల్ నెట్వర్క్ ఇంజినీర్గా పనిచేసి చేసిన అంజన్.. ఇటీవలనే స్వదేశానికి వచ్చాడు. కొంతకాలంగా గన్నవరంలోని తన నివాసంలో అంజన్ ఖాళీగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా.. అతను వైసీపీ సర్కారుపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడనే ఆరోపణతో.. గన్నవరం పోలీసులు అంజన్ నివాసానికి వచ్చి అదుపులోకి తీసుకున్నట్లు.. అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంజన్ ల్యాప్టాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అంజన్ అరెస్టుపై అతని తల్లి రత్నకుమారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఎక్కడ ఉన్నాడో ఒక్కసారి చూపించాలని ఆమె పోలీసులను కోరుతున్నారు. ఇదే అంశంపై టీడీపీ చంద్రబాబు ఘాటుగా స్పందించారు. 'పోలీసులు అక్రమంగా నిర్బంధించిన గన్నవరం యువకుడు అంజన్ను వెంటనే విడుదల చేయాలి. సీఎంపై పోస్ట్ పెట్టాడని అంజన్ను తీసుకువెళ్లిన పోలీసులు.. ఇప్పటికీ అతని ఆచూకీ చెప్పకపోవడం నిబంధనల ఉల్లంఘనే. డీజీపీ తప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలి. అంజన్ను వెంటనే విడుదల చేయాలి' అని ట్వీట్ చేశారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
Read Latest Andhra Pradesh News and Telugu News