యాప్నగరం

హాస్టల్ భవనంపై నుంచి దూకేసిన విద్యార్థిని.. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలకలం

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ కళాశాల ప్రాంగణంలో దారుణం చోటుచేసుకుంది. పరీక్షలు ఫెయిల్ అయ్యాననే బాధతో.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!

Samayam Telugu 27 Mar 2022, 10:12 pm
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యానికి పాల్పడింది. హస్టల్‌ భవనం పై నుంచి విద్యార్థిని దూకేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కొత్తపేటకు చెందిన హారిక అనే విద్యార్థిని నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఈసీఈ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శనివారం ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల కాగా, హారికకు నాలుగు సబ్జెక్టులు బ్యాగ్‌లాగ్‌లుగా మిగిలిపోయాయి.
Samayam Telugu నూజివీడు ట్రిపుల్ ఐటీ


దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థిని కె-3 బ్లాక్‌లోని మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. రోడ్డుపై పడ్డ విద్యార్థిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. హారిక వెన్నుముక, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.