యాప్నగరం

చెల్లాచెదురుగా అన్నం క్యారేజీలు, కూలీలు.. గుంటూరులో ఘోరప్రమాదం

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పదిహేను మంది కూలీలతో వెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 7 Jan 2021, 1:50 pm
చెల్లాచెదురుగా పడి ఉన్న అన్నం క్యారేజీలు.. కూలీల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. పొట్టకూటి కోసం పనికి బయల్దేరిన కూలీలు కొద్దిసేపట్లో గమ్యం చేరుకుంటారనేలోపే ఆటో బోల్తా పడింది. తమ వెంట కూలీకి వచ్చిన తోటికూలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది తీవ్రగాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం గుంటూరు జిల్లాలో జరిగింది.
Samayam Telugu బోల్తా పడిన ఆటో
accident


సత్తెనపల్లి మండలం గండ్లూరు అడ్డరోడ్డు వద్ద 15 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గాయపడిన వారిని ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూలీల వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.