యాప్నగరం

విజయవాడ: తొలిరోజే ముందే వెళ్లిపోయిన కువైట్ ఫ్లైట్.. ఎయిర్ ఇండియాపై ప్రయాణికుల ఆగ్రహం

Vijayawada Kuwait Flight Missing నేటి నుంచి కువైట్‌కు విమాన సర్వీసులు ప్రారంభించిన ఎయిర్ ఇండియా. తొలిరోజే గందరగోళంతో విమానం మిస్సైన ప్రయాణికులు. మధ్యాహ్నం 1.10కు వెళ్లాల్సిన విమానం.. ఉదయం 9.55 కు వెళ్లిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు. అయితే ముందే సమాచారం ఇచ్చామని చెబుతున్న ఎయిర్ ఇండియా సిబ్బంది. తమకు మెసేజ్‌లు రాలేదంటున్న ప్రయాణికులు.. ఎయిర్‌లైన్స్ సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం. 20మంది వరకు ప్రయాణికులు కువైట్ విమానం మిస్ అయ్యారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 Mar 2023, 1:25 pm

ప్రధానాంశాలు:

  • విజయవాడ నుంచి కువైట్‌కు విమాన సర్వీస్
  • ప్రారంభమైన తొలిరోజే అంతా గందరగోళం
  • విమానం మిస్సైన 20మంది ప్రయాణికులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vijayawada Kuwait Flight Launch
విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి కువైట్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వేసవి సర్వీస్ ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి అక్టోబర్ చివరి వరకు ప్రతి బుధవారం ఉదయం 9.55కి గన్నవరం నుంచి నేరుగా కువైట్‌కు ఫ్లైట్ నడవనుంది. తొలిరోజు 67 మంది ప్రయాణికులతో గన్నవరం నుంచి కువైట్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బయల్దేరివ వెళ్లింది. అయితే సర్వీస్ ప్రారంభమైన తొలిరోజు కాస్త గందరగోళం ఏర్పడింది.
బుధవారం ఉదయం 9:55కు ప్రయాణికులతో గన్నవరం నుంచి కువైట్‌కు విమానం బయల్దేరి వెళ్లింది. ఫ్లైట్ వెళ్లిన కొద్దిసేపటికి కువైట్ వెళ్లేందుకు 20 మంది ప్రయాణికులు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం 1:10 నిమిషాలకు వెళ్లాల్సిన విమానం ముందే వెళ్లడమేంటంటూ ఎయిర్ ఇండియా సిబ్బందిన నిలదీశారు. ఫ్లైట్ ఉదయం 9:55 నిమిషాలకే బయల్దేరుతుందని మెసేజ్ పెట్టామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. తమకు ఎలాంటి మెసేజ్‌లు రాలేదని ఎయిర్ ఇండియాపై అసహనం వ్యక్తం చేశారు.

విమానం వెళ్లిపోయిన తర్వాత రావడంతో ఉసూరుమన్నారు. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఇచ్చిన సమయాన్ని ఎయిర్ ఇండియా మార్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. గన్నవరం విమానాశ్రయం దగ్గర ఆందోళకు దిగారు. విమాన సర్వీస్ ప్రారంభించిన తొలిరోజే ఇలా జరగడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు అసలు తప్పు ఎక్కడ జరిగిందో ఆరా తీసే పనిలో ఉన్నారు ఎయిర్ ఇండియా అధికారులు. ఈ గందరగోళంపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు నాలుగు రోజుల క్రితమే విజయవాడ నుంచి షిర్డీకి విమాన సర్వీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇండిగో ఎయిర్‌లైన్స్
రోజువారీ స్పెషల్ ఫ్లైట్ సర్వీసు మొదలైంది. విమానం ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి నుంచి విజయవాడకు వస్తుంది.. అక్కడి నుంచి 12:25 గంటలకు బయలుదేరి షిర్డీ వెళుతుంది. అటు షిర్డీలో మధ్యాహ్నం 02:20 గంటలకు బయలుదేరి 4:26 గంటలకు విజయవాడ వస్తుంది. ప్రయాణికుల కోసం ప్రతి రోజూ ఈ సర్వీసు నడుస్తోంది. ఈ ఫ్లైట్ టికెట్‌ ప్రారంభ ధర రూ.4,639.. డిమాండ్‌ను బట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ కోరింది. విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి డిమాండ్ ఉన్న చోటికి.. ప్రయాణికుల రిక్వెస్ట్‌తో విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే షిర్డీకి ఇండిగో విమాన సర్వీస్ నడుపుతోంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.