యాప్నగరం

అఫైర్ అడ్డుగా ఉందని భార్యను చావబాదిన కానిస్టేబుల్... రెచ్చగొట్టిన తల్లి

ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు కట్టుకున్న భార్యపైనే దాడికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో జరిగింది. ఆస్పత్రి పాలైన భార్య అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 12 Jun 2021, 3:51 pm
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో సునీల్ అనే పోలీస్ కానిస్టేబుల్ భార్య నవ్యపై తీవ్రంగా దాడిచేశాడు. కీసర గ్రామానికి చెందిన సునీల్ వత్సవాయి పోలీస్‌స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సునీల్ తల్లి ఇటీవల అధికార పార్టీ తరపు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కొంతకాలంగా సునీల్, నవ్య మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరగ్గా సునీల్ తన భార్యను విచక్షణా రహితంగా దాడి చేశాడు.
Samayam Telugu Image



దీంతో బంధువులు ఆమెను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే నవ్య వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది. తనను కొట్టమని అత్తే తన భర్తను రెచ్చగొట్టిందని ఆరోపించింది. సునీల్‌కు జగ్గయ్యపేటకు చెందిన మహిళతో అక్రమ సంబంధం ఉందని, అడ్డు తొలగించుకునేందుకు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ్య దగ్గర వాంగ్మూలం తీసుకున్న నందిగామ పోలీసులు సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసే ఇలా దాడికి పాల్పడటం దారుణమని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. సునీల్‌ను కఠినచర్యలు తీసుకోవడంతో పాటు అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.