యాప్నగరం

Vijayawada: పేకాట జోరుకి పోలీసుల బ్రేక్

గ్రామంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. జూదరులను అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు.

Samayam Telugu 1 Jan 2021, 6:39 pm
న్యూ ఇయర్ వేడుకలకు పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న జూదరులకు పోలీసులు చెక్ పెట్టారు. అనూహ్యంగ దాడులు చేసి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. లక్ష రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తాడేపల్లి రూరల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శిబిరంపై దాడులు నిర్వహించి 12 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. లక్షా 24 వేల రూపాయల నగదు, 12 సెల్‌ఫోన్లు 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
police


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.