యాప్నగరం

RTC డ్రైవర్‌కు స్కూల్ బ్యాగ్ ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. సీన్‌లోకి పోలీసుల ఎంట్రీ!

Drugs: విజయవాడలో మరోసారి MDMA డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ వద్ద 40 గ్రాముల MDMA డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బ్యాగును తనకు అనంతపురంలో ఓ వ్యక్తి ఇచ్చాడని.., అందులో ఏముందో తనకు తెలియదని డ్రైవర్ పోలీసులకు వెల్లడించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 2 Apr 2023, 4:57 pm

ప్రధానాంశాలు:

  • విజయవాడలో డ్రగ్స్ కలకలం
  • ఆర్టీసీ బస్సులో MDMA డ్రగ్స్ సరఫరా
  • మాటు వేసి పట్టుకున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vijayawada Drugs
విజయవాడలో డ్రగ్స్ పట్టివేత
Vijayawada Drugs: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 40 గ్రాముల డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్‌ను బెంగుళూరు నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెంగుళూరు నుంచి విజయవాడకు గతరాత్రి బయల్దేరింది. అనంతపూర్‌లో ఓ వ్యక్తి స్కూల్ బ్యాగును బస్సు డ్రైవర్‌కు ఇచ్చి దాన్ని విజయవాడలో మరో వ్యక్తికి అందజేయాలని సూచించాడు. అందులో ఏముందో తెలియని బస్సు డ్రైవర్ వైవీ రావు బ్యాగును తీసుకున్నాడు.
ఆదివారం ఉదయం బస్సు విజయవాడకు చేరుకుంది. అయితే అప్పటికే పక్కా సమాచారం మేరకు మాటువేసిన పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న స్కూల్ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగును చెక్ చేయగా.. అందులో ఉన్న ప్యాంట్ నడుము చుట్టూ అంగుళం మందంలో 40 గ్రాముల MDMA డ్రగ్‌ను కుట్టిపెట్టారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న విజయవాడ టాస్క్‌పోర్స్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ బ్యాగులో డ్రగ్స్ ఉన్న విషయం తనకు తెలియదని డ్రైవర్ పోలీసులకు చెప్పినట్లుగా తెలిసింది. బ్యాగ్ ఇచ్చిన వ్యక్తి కోసం అనంతపురం బస్టాండ్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

విజయవాడలో గతేడాది డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆదార్ కార్డులను ట్యాంప‌రింగ్ చేసి నిషేధిత ప‌దార్థాల‌ను త‌ప్పుడు ధ్రువ‌ ప‌త్రాలతో ఇత‌ర దేశాల‌కు ర‌వాణా చేసిన‌ట్లుగా పోలీసులు నిర్ధారించారు. విజయవాడ భారతీ నగర్‌లోని ఓ కొరియర్ సెంటర్ నుంచి ఈ దొందా కొనసాగింది. సదరు కొరియర్ సంస్థ పని చేసే ఓ వ్యక్తి విజయవాడ నుంచి ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్ అనే నిషేధిత తెల్ల పౌడర్ ను పంపిన‌ట్లుగా బెంగుళూరు కస్టమ్స్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు.

విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో గతేడాది దర్యాప్తు చేప‌ట్టారు. ఆధార్, ఫోటో, డేట్ ఆఫ్ బర్త్‌లలో మార్పులను చేసి సదరు తప్పుడు ధ్రువ ప‌త్రాల‌తో చెన్నైకు చెందిన ముఠా విజయవాడ కేంద్రంగా చీరల మూటన ఎఫిడ్రిన్ అనే నిషేధిత ఉత్ప్రేరక పదార్థాన్ని ఆస్ట్రేలియాకు కొరియర్ చేసిన‌ట్లుగా నిర్దారించారు. అయితే ఈ కేసుపై పెద్ద రాజకీయ దుమారమే రేగింది. ఈ డ్రగ్స్ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి విజయవాడలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.