యాప్నగరం

విజయవాడ: ఆర్టీసీ బస్సులో పోలీసుల తనిఖీలు.. బ్యాగులో అంత డబ్బు చూసి షాక్

కృష్ణా జిల్లా దొనబండ చెక్ పోస్ట్ దగ్గర వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న బస్సులో పోలీసులు సోదాలు చేశారు.

Samayam Telugu 21 Jan 2021, 11:20 am
కృష్ణా జిల్లాలో కరెన్సీ కలకలంరేపింది. కంచికచర్ల మండలంల దొనబండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక వ్యక్తి నుండి భారీగా డబ్బును స్వాధీనం చేసుుకున్నారు. పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న బస్సులో పోలీసులు సోదాలు చేశారు. బస్సులో ఉన్న ఒక వ్యక్తి దగ్గర బ్యాగ్ చూసి అనుమానం వ్యక్తం చేశారు. ఆ బ్యాగులో లెక్కలు చూపని సుమారు రూ.50 లక్షలు సీజ్ చేశారు.
Samayam Telugu భారీగా డబ్బు సీజ్ (File Photo)


ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అంత డబ్బుఎక్కడి నుండి వచ్చాయి.. ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంత భారీగా డబ్బులు పట్టుబడటంతో పోలీసులు కూడా షాకయ్యారు. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో చెక్‌పోస్టుల దగ్గర పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది. ఇప్పుడు హైదరాబాద్ వెళుతున్న బస్సులో డబ్బులు బయటపడటం కలకలంరేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.