గర్భం దాల్చావని డాక్టర్లు చెప్పడంతో ఆ మహిళ మురిసిపోయింది. కడుపులో బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడని, మందులు వాడమంటూ డాక్టర్లు చెబుతూ వచ్చారు. 10 నెలలు దాటినా పురిటినొప్పులు రాకపోవడంతో స్కానింగ్ చేయించుకోగా కడుపులో బిడ్డే లేదని, ఓ గడ్డ ఉందని చెప్పడంతో ఆమెతో కుటుంబసభ్యులంతా షాకయ్యారు. దీనికి బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా వస్తున్నా కనీసం కడుపులో బిడ్డ పరిస్థితి ఎలా ఉందనేది డాక్టర్లు పట్టించుకోలేదని ఆరోపించారు. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విజయవాడ గులాబీ తోటకు చెందిన కె.సుధారాణి(21)కి శ్రీకాకుళానికి చెందిన సంతోష్తో వివాహం జరిగింది. ఏడో నెల గర్భిణిగా ఉన్న సుధారాణి మూడు నెలల క్రితం ప్రసవం కోసం విజయవాడలోని పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి విజయవాడ పాత ఆస్పత్రిలోని మాతాశిశు విభాగంలో వైద్య పరీక్షల కోసం వస్తోంది. మూడు నెలలుగా ఆమె వస్తున్నా కనీసం కడుపులో బిడ్డ ఎలా ఉందనే వైద్య పరీక్షలను చేయలేదు. ప్రతిసారి బిడ్డ, తల్లి ఆరోగ్యం బాగానే ఉందని, పురిటి నొప్పులు వస్తే తీసుకురండంటూ వైద్యులు చెబుతూ వస్తున్నారని బాధితురాలు వాపోయారు.
ప్రసవం కోసం వైద్యులు చెప్పిన సమయం కూడా దాటిపోయినా ఇంకా సుధారాణికి నొప్పులు రాలేదు. పది నెలలు నిండిపోతున్నా నొప్పులు రాలేదని మరోసారి వైద్యులను సంప్రదించగా ఏం ఫర్వాలేదని చెప్పి పంపించేశారు. దీంతో అనుమానం వచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రికి సోమవారం వెళ్లి స్కానింగ్ తీసుకుంది. దాన్ని చూసిన డాక్టర్లు కడుపులో బిడ్డ లేదని, చాలా నెలల క్రితమే ఇన్ఫెక్షన్ వచ్చి గడ్డలా మారిపోయిందని చెప్పడంతో షాకైంది.
దీంతో సుధారాణి, బంధువులు కలిసి సోమవారం మధ్యాహ్నం పాతాసుపత్రికి వచ్చి మాతాశిశు విభాగంలోని వైద్య సిబ్బందిని సంప్రదించారు. ప్రస్తుతం స్కానింగ్ సిబ్బంది అందుబాటులో లేరని, ప్రధాన వైద్యులు కూడా లేరని, మంగళవారం రావాలంటూ అక్కడి సిబ్బంది సూచించారు. బిడ్డ లేదని తెలియడంతో తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, అత్యవసరంగా వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే బాధితురాలికి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై విజయవాడ పాత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు స్పందిస్తూ.. బిడ్డ పెరుగుదల ఆగిపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుదన్నారు. ఐదో నెలలోనే స్కానింగ్ చేసి ఈ విషయాన్ని వైద్యులు గుర్తించి చెబుతారని, ఆ తర్వాత కూడా నెలన్నరకోసారి గర్భిణులకు ఆసుపత్రిలో స్కానింగ్ చేస్తుంటారని తెలిపారు. పాతాసుపత్రిలో ప్రతి రోజూ 20 నుంచి 30 మందికి పైగా గర్భిణులకు స్కానింగ్ చేసి రిపోర్టులు ఇస్తున్నామని. ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో ఎనిమిది, తొమ్మిదో నెలల్లో వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నెలలు నిండుతున్న వారు కచ్చితంగా స్కానింగ్ చేయించుకోవాలని,కొంతమందికి అవగాహన లేక పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటారని పేర్కొన్నారు. తాజా సంఘటనలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రసవం కోసం వైద్యులు చెప్పిన సమయం కూడా దాటిపోయినా ఇంకా సుధారాణికి నొప్పులు రాలేదు. పది నెలలు నిండిపోతున్నా నొప్పులు రాలేదని మరోసారి వైద్యులను సంప్రదించగా ఏం ఫర్వాలేదని చెప్పి పంపించేశారు. దీంతో అనుమానం వచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రికి సోమవారం వెళ్లి స్కానింగ్ తీసుకుంది. దాన్ని చూసిన డాక్టర్లు కడుపులో బిడ్డ లేదని, చాలా నెలల క్రితమే ఇన్ఫెక్షన్ వచ్చి గడ్డలా మారిపోయిందని చెప్పడంతో షాకైంది.
దీంతో సుధారాణి, బంధువులు కలిసి సోమవారం మధ్యాహ్నం పాతాసుపత్రికి వచ్చి మాతాశిశు విభాగంలోని వైద్య సిబ్బందిని సంప్రదించారు. ప్రస్తుతం స్కానింగ్ సిబ్బంది అందుబాటులో లేరని, ప్రధాన వైద్యులు కూడా లేరని, మంగళవారం రావాలంటూ అక్కడి సిబ్బంది సూచించారు. బిడ్డ లేదని తెలియడంతో తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, అత్యవసరంగా వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే బాధితురాలికి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై విజయవాడ పాత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు స్పందిస్తూ.. బిడ్డ పెరుగుదల ఆగిపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుదన్నారు. ఐదో నెలలోనే స్కానింగ్ చేసి ఈ విషయాన్ని వైద్యులు గుర్తించి చెబుతారని, ఆ తర్వాత కూడా నెలన్నరకోసారి గర్భిణులకు ఆసుపత్రిలో స్కానింగ్ చేస్తుంటారని తెలిపారు. పాతాసుపత్రిలో ప్రతి రోజూ 20 నుంచి 30 మందికి పైగా గర్భిణులకు స్కానింగ్ చేసి రిపోర్టులు ఇస్తున్నామని. ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో ఎనిమిది, తొమ్మిదో నెలల్లో వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నెలలు నిండుతున్న వారు కచ్చితంగా స్కానింగ్ చేయించుకోవాలని,కొంతమందికి అవగాహన లేక పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటారని పేర్కొన్నారు. తాజా సంఘటనలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.