యాప్నగరం

విజయవాడ : దసరాకు ఊరెళ్తున్నవారికి శుభవార్త.. స్పెషల్ రైళ్లు, వివరాలివే

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. దసరా రద్దీతో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించారు. విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు. నరసాపూర్-సికింద్రాబాద్-నరసాపూర్ మధ్య రైళ్లు. అలాగే విశాఖపట్నం-మహబూబ్ నగర్-విశాఖపట్నం మధ్య స్పెషల్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్ల వివరాలు.. ఏ, ఏ స్టేషన్లలో ఆగుతాయి వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రైళ్లన్నీ ఫుల్.. ఇంకా రద్దీ ఉండటంతో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 Sep 2022, 9:06 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Dasara Special Trains
దసరాకు ఊరెళ్లేవారికి శుభవార్త.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు నడపుతున్నారు. సికింద్రాబాద్‌–తిరుపతి (02764) రైలు అక్టోబర్‌ 1న రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే ఈ రైలు (02763) తిరుగు ప్రయాణంలో 2న సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్‌ వస్తుంది. ఈ స్పెషల్ రైలు జనగాం, ఖాజీపేట, వరంగల్లు, మహబూబ్‌నగర్, డోర్నకల్లు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
ఇటు నరసాపూర్‌–సికింద్రాబాద్‌–నరసాపూర్‌ వయా గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. నరసాపూర్‌ – సికింద్రాబాద్‌ (07466) రైలు ఈ నెల 30న సాయంత్రం 6 గంటలకు నరసాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌ –నరసాపూర్‌ (07467 ) రైలు అక్టోబరు 1న సికింద్రాబాద్‌లో రాత్రి 9.05 గంటలకు బయల్దేరి నరసాపూర్‌ చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతుంది.

అంతేకాదు సికింద్రాబాద్‌–యశ్వంతపూర్‌ (07233) రైలు ఈ నెల 29, అక్టోబర్‌ 6, 13, 20న రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంతపూర్‌ చేరుకుంటుంది. ఈ రైలు (07234) తిరుగు ప్రయాణంలో ఈ నెల 30, అక్టోబర్‌ 7, 14, 21న సాయంత్రం 3.50 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

మరోవైపు విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు (08579/08580) నడవనున్నాయి. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 26 వరకు నడుస్తాయి. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. విశాఖపట్నం-మహబూబ్‌నగర్-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు (08585/08586 ) నడపాలని నిర్ణయించారు. ఈ రైళ్లు అక్టోబర్ 4 నుంచి 25 వరకు కొనసాగుతాయి. ఈ రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రామజండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్లలో ఆగుతాయి. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.