యాప్నగరం

Rain Alert: ఏపీకి అలర్ట్.. రానున్న రెండు రోజుల్లో వర్షాలు !

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ఎత్తు నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) స్పష్టం చేసింది. పొడి వాతావరణం మొదలయ్యాక రాష్ట్రంలో చలి ప్రభావం అధికమవుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు చలి తీవ్రతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.

Authored byసందీప్ పూల | Samayam Telugu 27 Nov 2022, 8:46 am

ప్రధానాంశాలు:

ఏపీకి వర్ష సూచన
రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురస్తాయన్న ఐఎండీ
అనంతరం చలితీవ్రత పెరిగే అవకాశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rain Alert for andhra pradesh
ఏపీకి వర్షాలు
Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతానికి తమిళనాడు వైపు కదులుతోందని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) స్పష్టం చేసింది.
ఏపీలో దిగువస్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఇవి మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. అనంతరం పొడి వాతావరణం మొదలయ్యాక రాష్ట్రంలో చలి ప్రభావం అధికమవుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. శనివారం తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇనుగుంటలో 7.6 సెం.మీల భారీ వర్షపాతం నమోదైంది.

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరుగుతుంది. సాయంత్రం నుంచి ఉదయం వరకు మంచు దుప్పటి కప్పుకుంటుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాలు పొగమంచులోనే ఉంటున్నాయి. ఈ ప్రాంతాల్లో 10-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

నల్లొండ, ఖమ్మం జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. ఏపీలోని అరకు, మన్యం ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకొని ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు పర్యటకుల తాకిడి పెరిగింది.

రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.