యాప్నగరం

‘పేకాట ఆడిస్తూ పట్టుబడ్డ కొడాలి నాని బావమరిది’.. టీడీపీ ఆరోపణలు.. జగన్‌ను కలిసిన మంత్రి?

Pawan Kalyan గుడివాడ పర్యటన తర్వాత అక్కడి రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నియోజకవర్గంలో పేకాట శిబిరంపై జరిగిన దాడుల్లో మంత్రి బామ్మర్ది సైతం అరెస్టయ్యారని టీడీపీ ఆరోపిస్తోంది.

Samayam Telugu 4 Jan 2021, 1:32 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత గుడివాడ రాజకీయాలు హీటెక్కాయి. పేకాట క్లబ్‌‌లంటూ పవన్ వ్యాఖ్యానించడం.. తాజాగా గుడివాడ నియోజకవర్గంలోని తమ్మిరస గ్రామంలో పేకాట స్థావరాలపై భారీ ఎత్తున దాడులు జరగడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎస్ఈబీ దాడుల్లో భారీగా నగదు, కార్లు పట్టుబడ్డాయని తెలుస్తోంది. ఈ దాడుల్లో మంత్రి కొడాలి నాని బామ్మర్ది (భార్య సోదరుడు) కొల్లి విజయ్ పట్టుబడ్డారని తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తోంది.
Samayam Telugu kodali-jagan (file photo)
Kodali Nani with CM Jagan (File Photo)


నందివాడ పీఎస్ పరిధిలో అక్రమంగా పేకాట ఆడతున్న శిబిరంపై దాడి చేసిన పోలీసులు 60 మందిని అరెస్ట్ చేశారని.. వారిలో కొల్లి విజయ్ కూడా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 40 కార్లతోపాటు రూ.10 కోట్ల డబ్బు పట్టుకున్నారని టీడీపీ ట్విట్టర్ ద్వారా ఆరోపణలు గుప్పించింది.
కాగా మంత్రి కొడాలి నాని అకస్మాత్తుగా తాడేపల్లి వెళ్లి సీఎం జగన్‌ను కలిశారని ప్రచారం జరుగుతోంది. మీడియాలో పేకాట శిబిరాల గురించి కథనాలు రావడంతో.. సోమవారం మధ్యాహ్నం మంత్రి హడావుడిగా సీఎం నివాసానికి వెళ్లారని సమాచారం. పవన్ పేకాట క్లబ్‌లు అని వ్యాఖ్యానించడం.. తర్వాత గుడివాడలోని పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆ తర్వాత నాని సీఎంను కలవడానికి వెళ్లారని ప్రచారం జరుగుతుండటం.. ఇవన్నీ చూస్తుంటే.. కృష్ణా జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయనే భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.