విజయవాడ (Vijayawada)లో వీధి కుక్కల రెచ్చిపోయాయి. భవానీపురంలో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. స్థానికులు రాడ్డుతో కుక్కలను తరిమేయడంతో ప్రమాదం తప్పింది. కుక్కల దాడిలో నజీర్, చైతన్య కుమార్, జెస్సిక అనే ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. ఇప్పటికే హైదరాబాద్ ఘటనతో వీఎంసీ అప్రమత్తంకాగా.. తాజాగా నగరంలో కుక్కలు పిల్లలపై దాడి చేయడం కలకలంరేపింది. వెంటనే వీఎంసీ బృందాలు కుక్కలను పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ (Hyderabad)లోని అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ విషాదాన్ని నింపింది. ఆ తర్వాత కూడా హైదరాబాద్తో పాటూ పలు జిల్లాల్లో కుక్కలు దాడి చేసిన ఘటనలు జరిగాయి. ఇప్పుడు విజయవాడలో కూడా చిన్నారులపై విరుచుకుపడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News