యాప్నగరం

Gudivada లో క్యాసినో, అమ్మాయిలు: గోవాను మించే ఎంజాయ్.. రూ. 500 కోట్లు.. ఎస్పీకి టీడీపీ ఫిర్యాదు

ఏపీ మంత్రి కొడాలి నానిపై తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో..!

Samayam Telugu 17 Jan 2022, 8:54 pm
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి పండుగ వేళ జూదశాల నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గుడివాడలో క్యాసినో, జూదం, పేకాట, అమ్మాయిలు, అసభ్యకర నృత్యాలు.. ఇలా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని తెలుగు దేశం నాయకులు ఆరోపిస్తున్నారు. గోవా రాష్ట్రాన్ని మించేలా గుడివాడలో తతంగం సాగుతోందని చెబుతున్నారు.
Samayam Telugu మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు



ఈ క్రమంలో కృష్ణా జిల్లా గుడివాడలోని కే కన్వెన్షన్‌ సెంటర్‌లో క్యాసినో నిర్వహణకు సంబంధించి మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. జూదం, అమ్మాయిలతో అసభ్య నృత్యాల నిర్వహణ ద్వారా రూ. 500 కోట్లు చేతులు మారాయని ఫిర్యాదులో ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని దెబ్బతీసే చర్యలను పోలీసులు ఉపేక్షించటం తగదని హితవుపలికారు.


భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమా, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.