యాప్నగరం

Vijayawada: టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా.. కలిసి పనిచేస్తాం: కేశినేని నాని

Vijayawada: కృష్ణా జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఉప్పు.. నిప్పుగా ఉండే టీడీపీ, వైసీపీ నేతలు ఒకేచోట కనిపించారు. అంతేనా.. ఒకరిపై మరోకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అవును.. టీడీపీ ఎంపీ కేశినేని.. వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుపై పొగడ్తల వర్షం కురిపించారు. అటు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కూడా.. కేశినేని నానిని ఆకాశానికెత్తారు. వీరిద్దరి పొగడ్తల రాజకీయం ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 21 May 2023, 2:49 pm

ప్రధానాంశాలు:

  • వైసీపీ ఎమ్మెల్యేను ప్రశంసించిన ఎంపీ కేశినేని నాని
  • జగన్ మోహన్ రావుపై కేశినేని నాని పొగడ్తల వర్షం
  • సిద్ధాంతాలు వేరైనా కలిసి పనిచేస్తామని స్పష్టం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Keshineni Nani praises YCP MLA
వైసీపీ ఎమ్మెల్యేపై కేశినేని నాని ప్రశంసలు
Vijayawada: వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావును టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసించారు. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. అభివృద్ధిలో ముందుంటారని వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా.. అభివృద్ధి కోసం కలిసి పని చేస్తాం అని ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) స్పష్టం చేశారు. చందర్లపాడు మండలం తోటరావులపాడులో.. వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన కేశినేని నాని.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
'రాజకీయం అనేది ఎలక్షన్స్ వరకే పరిమితం అవ్వాలి. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు (Mondithoka Jaganmohan Rao) ప్రజా సమస్యలపై పోరాడుతూ.. అభివృద్ధిలో ముందు ఉంటారు. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరు. అయినా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం. అభివృద్ధి కార్యక్రమంలో కలిసి పనిచేసిన టీడీపీ, వైసీపీ నాయకులకు, అధికారులకు ధన్యావాదాలు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇదే విధంగా కలిసి పనిచేస్తే.. దేశం చాలా అభివృద్ధి చెందుతుంది' అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు.
ఇటు కేశినేని నానిపై ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు కూడా పొగడ్తలు కురిపించారు. 'టాటా ట్రస్ట్‌ను తీసుకొచ్చి.. ప్రజలకు సేవా చేసిన ఘనత కేశినేని నానిదే. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత.. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం పని చేయాలి. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఎంపీ కేశినేని నాని, మేము అడుగుల వేస్తున్నాం. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తున్నాం. కాబట్టే ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతున్నాం' అని ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.