యాప్నగరం

కృష్ణా: ముగ్గురు పిల్లలు మిస్సింగ్.. వారిని గుర్తించేసరికే.. గుండెలు పిండేసే ఘటన!

కృష్ణా జిల్లాలో గుండెలు పిండేసే సంఘటన చోటుచేసుకుంది. సోమవారం మిస్ అయిన ముగ్గురు పిల్లలు, విషాదకరరీతిలో..!

Samayam Telugu 22 Jun 2021, 11:31 pm
కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలంలో ఊహకందని విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారుల అదృశ్యం విషాదాంతమైంది. అగిరిపల్లి మండలంలోని ఈదర సగరపేటలో చెరువులో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆడుకునేందుకు సోమవారం బయటకు వెళ్లిన జగదీష్ (8), చంద్రిక (9), శశిత (11) కనిపించకుండా పోయారు.
Samayam Telugu చెరువులో చిన్నారి మృతదేహం


చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారులు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ తరుణంలో ఈదరకు సమీపంలోని శోభనాపురం చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను మంగళవారం పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.