యాప్నగరం

కృష్ణా: వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే.. చాన్నాళ్లుగా సైలెంట్, మళ్లీ యాక్టివ్

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కె.రక్షణనిధి సమక్షంలో పార్టీలో చేరారు.

Samayam Telugu 10 Mar 2021, 12:02 pm

ప్రధానాంశాలు:

  • సజ్జల సమక్షంలో వైసీపీలో చేరిన పద్మ జ్యోతి
  • 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
  • పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానన్న జ్యోతి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu విజయవాడ
కృష్ణా జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కంచర్ల ముత్యప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కె.రక్షణనిధి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి సజ్జల ఇద్దరిని పార్టీలోకి ఆహ్వానించారు. పద్మజ్యోతి 2009లో తిరువూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సంక్షేమ పథకాలు అమలు తీరు నచ్చి.. సీఎం జగన్ పాలన నచ్చి పార్టీలో చేరినట్లు పద్మజ్యోతి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీకి తనవంతు సేవలు అందిస్తాను అంటున్నారు. చాన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న పద్మజ్యోతి వైఎస్సార్‌సీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.